మణిరత్నంకు ఏదీ కలిసి రావట్లేదు. ఎవరిని టచ్ చేసినా.. మణికి షాకులే తగులుతున్నాయి. ఈ వెటరన్ డైరెక్టర్ ని అందరూ సమస్యల్లో పడేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అమలాపాల్ కూడా ఈ మేకర్ కు ఝలక్ ఇచ్చింది.
రాజరాజ చోళుడు కథాంశంతో "పొన్నియిన్ సెల్వన్" సినిమా తీస్తున్నాడు మణిరత్నం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, అమలాపాల్ ని లీడ్ రోల్స్ కు తీసుకున్నాడు మణిరత్నం. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. అయితే ఈ టైమ్ లో అమలాపాల్ సినిమా నుంచి తప్పుకొని మణిరత్నం కు షాక్ ఇచ్చింది.
మణి రత్నం చాలా కాలంగా ఫ్లాపులతో ఫైట్ చేస్తున్నాడు. ఈ పరాజయాలకు బ్రేకులేసేందుకు "పొన్నియిన్ సెల్వన్" తీస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కే స్టార్ కాస్టింగ్ తో బ్రేకులు పడుతున్నాయి. ఏరికోరి తీసుకున్న అమలాపాల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో డిసెంబర్ లో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ మరికొంత కాలం వాయిదా పడే ప్రమాదముందని చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్ లో స్టార్ట్ అవ్వాల్సిన షెడ్యూల్స్ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో ఈ సినిమా డేట్స్ మరో ప్రాజెక్ట్ తో క్లాష్ అవుతున్నాయని "పొన్నియిన్ సెల్వన్" నుంచి తప్పుకుంది అమల. అయితే మణిరత్నం ఇంతకుముందా ఫుల్ ఫామ్ లో ఉండుంటే.. అమలాపాల్ మిగతా సినిమాలను పక్కనపెట్టి మరీ "పొన్నియిన్ సెల్వన్" కే డేట్స్ ఇచ్చేదని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. నాలుగు ఫ్లాపులు రాగానే మణిరత్నంను తక్కువగా చూస్తున్నారని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. మరి హిస్టారికల్ మూవీని తీస్తున్న మణిరత్నంను ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి. వరుస ఫ్లాపుల నుంచి ఈ సినిమా ద్వారా గట్టెక్కితే మణిరత్నం మళ్ళీ హిట్ డైరెక్టర్ లిస్టులోకి ఎక్కుతాడు.