ఈ మధ్య సెలెబ్రిటీలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అంశం ఏదైనా వాళ్ళు చేసే వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా మరో ప్రఖ్యాత దర్శకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళంలో 80, 90 లలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగానూ నటించిన నటుడు కమ్ దర్శకుడు భాగ్యరాజ్ తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఈ దర్శకుడు మీడియాలో కనిపిస్తుంది మాత్రం వివాదాల ద్వారానే.
ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యేవి. ప్రస్తుతం ఆయన చేస్తున్న నిర్వాకాలు మనకు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. మహిళలు రేప్ కి గురవడానికి కారణం కేవలం మగవాళ్ళే కాదని, దానికి ఆడవాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారని అందువల్లే రేప్ లు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఒక మగాడికి రేప్ చేయడానికి అవకాశమిచ్చేలా మహిళ ప్రవర్తన ఉంటుందని ఆయన అరోపణ. అత్యాచారాల విషయంలో కేవలం మగవాళ్ళని తప్పుబట్టడం సరికాదని ఆయన తేల్చేశారు.
ఈ రోజుల్లో అమ్మాయిలు రెండు మూడు ఫోన్లు వాడుతూ.. చాలా సిమ్లు మెయింటైన్ చేస్తున్నారని.. తప్పుదోవ పడుతున్నారని.. వాళ్లు చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రేప్లు జరుగుతున్నాయని భాగ్యరాజ్ అన్నాడు. తమ డ్రెస్సింగ్, ప్రవర్తన ద్వారా మగాళ్లకు తప్పు చేసే అవకాశం ఇస్తున్నది మహిళలే అని, కాబట్టి రేప్లు జరగడానికి వాళ్లు కూడా కారణమని ఆయన అన్నాడు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. భాగ్యరాజ్ ని శిక్షించాలనే డిమాండ్ పెరుగుతుంది. మహిళలను కించపరిచి మాట్లాడినందుకు అతనిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి భాగ్యరాజ్ తన మాటలని వెనక్కి తీసుకుంటాడా..లేదా తాను చేసిన పనిని సమర్థించుకుంటాడా అనేది చూడాలి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.