ప్రస్థుతం క్రేజీ హీరోయిన్స్ లిస్టులో పూజ హెగ్డే ముందు వరసలో కొనసాగుతోంది. రెండు కోట్ల భారీ పారితోషికం ఆమె డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమెకు మరో సమాధానం చెప్పకుండా ఆమె కోరిన పారితోషికం ఇచ్చి ఆమె డేట్స్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరితోను నటిస్తున్న పూజ హెగ్డే మ్యానియా నేటితరం యూత్ లో బాగా కనిపిస్తోంది. 

ఇలాంటి పరిస్థితులలో ఈమె ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు అమెరికాలో ఎదురైనా ఒక వింత ప్రశ్నను బయట పెట్టింది. ఈ మధ్య తాను అమరికాకు వెళ్ళినప్పుడు అక్కడ తనను కొంతమంది అమెరికన్స్ కలిశారని తాను  ఇండియా నుంచి వచ్చానని చెబితే "నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా" అంటూ వారు అడిగిన ప్రశ్నవిని షాక్ అయిన విషయాన్ని తెలియచేసింది. 

దీనితో ప్రభాస్ అమెరికన్స్ దృష్టిలో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎలా ఎదిగిపోయాడో తనకు అర్ధం అయింది అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను ఇప్పటి వరకు నటించిన హీరోలలో ప్రభాస్ లాంటి మంచి వ్యక్తిని చూడలేదు అని అంటూ ఎక్కడా గర్వం లేని ప్రభాస్ ను చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుంది అంటూ కామెంట్స్ చేసింది. 

ప్రభాస్ ‘సాహో’ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా ఆ సినిమాను ధియేటర్స్ కు వచ్చి ప్రేక్షకులు చూడటమే కాకుండా ఆ మూవీకి వందల కొట్లలో కలక్షన్స్ వచ్చాయి అంటే ప్రభాస్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ కు తనకు కామన్ పాయింట్ ఒకటి ఉంది అని చెపుతూ తనకు కూడ ప్రభాస్ లాగే బిర్యాని అంటే చాల ఇష్టమని అవకాసం దొరికినప్పుడు తామిద్దరం కలిసి అనేక సార్లు యూరప్ లో మటన్ బిర్యాని తిన్న సంఘటనలను గుర్తుకు చేసుకుంటూ ప్రభాస్ పై ప్రసంసలు కురిపిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రభాస్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: