విభిన్న ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్. తను తీసే ఏ సినిమాలోనైనా ప్రేమ అనే అంశం గాఢంగా ఉండేలా చుసుకుంటాడు. అతని చిత్రాలన్నీ దాదాపు ప్రేమ కథా చిత్రాలే. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు. తమిళ హీరో ధనుష్ హీరోగా 'ఎన్నయ్ నోకి పాయుమ్ తోట' తెరకెక్కించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమాను ఎట్టకేలకు ఈనెల 29న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

 

అయితే సినిమా విడుదలకు సిద్ధం అయింది కానీ ప్రమోషన్లకి మాత్రం హీరో ధనుష్ రావట్లేదట. ఎన్నో అవాంతరాలని ఎదుర్కొని సినిమా రిలీజ్ చేస్తుంటే కనీసం ప్రమోషన్లకి రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ధనుష్ రాకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయట. సినిమా ఇన్ని రోజులు వాయిదా పడడంతో గౌతమ్ కి ధనుష్ కి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయని, అందువల్లే ధనుష్ ప్రమోషన్లకి సైతం రావట్లేదని చెప్తున్నారు.

 

ఇదిలా ఉంటే గౌతమ్ మీనన్ రజనీకాంత్ తో సినిమా తీస్తున్నాడనే వార్త జోరందుకుంది. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయిదు ఆరు సంవత్సరాల క్రితమే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా ఏదో కారణం వల్ల సెట్ అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. రజనీ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే దర్బార్ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక రజనీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి గౌతమ్ సినిమా రజనీతో ఉంటుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: