‘బాహుబలి’ మరియు ‘సాహో’ సినిమా లతో బాలీవుడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలలో పాపులర్ హీరో అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో పాతకాలం నాటి ఓ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇలా ఉండగా తాజాగా నేషనల్ మీడియా కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై హాట్ కామెంట్ చేసింది.

 

పూజా హెగ్డే మాట్లాడుతూ… “ సినిమా ఇండస్ట్రీలో  నేను కలుసుకున్న మంచి పర్సన్స్ లో ఒకరు ప్రభాస్ అని పేర్కొంది. చాలా హానెస్ట్ గా నిజాయితీగా ప్రభాస్ వ్యక్తిత్వం ఉంటుందని మంచి స్వభావం కలిగి ఉన్న పర్సనాలిటీ ప్రభాస్ అని అలాంటి వ్యక్తిత్వం కలిగిన ప్రభాస్ ఎవరికైనా ఈజీగా నచ్చుతాడు అని హాట్ కామెంట్ చేసింది. ఎందుకంటె చాలా సాధారణంగా ఒక స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా డౌన్ టూ ఎర్త్ పర్సన్" అని పూజా అన్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే …. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అలా వైకుంఠపురం లో నటిస్తోంది.

 

సినిమా అయిన వెంటనే వరుసగా మంచి ఆఫర్లు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా చలామణి అవుతూ పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఆఫర్లు దక్కించుకుంటూ సక్సెస్ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. అయితే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రెమ్యునరేషన్ పూజకి చాలా ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు లేకపోవడంతో పూజ టైం నడుస్తుంది ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: