తను తీసే సినిమాలు రికార్డుల సంచలనాలు క్రియేట్ చేస్తాయో చెయ్యవో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం సంచలనం సృష్టిస్తాయి. వర్మ చేసే ప్రతి పనికి ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. కావాలని చేస్తాడా.. లేక వర్మ పంథానే ఇదా అన్నది పక్కన పెడితే ఆర్జివి అంటేనే ఓ సంచలనంగా మారింది. మొన్నామధ్య లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఆర్జివి లేటెస్ట్ గా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో వస్తున్నాడు.

 

ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టారు ఆర్జివి. పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా సరే సినిమాగా చెప్పడంలో తప్పేం లేదు. ఇది ఎవరిని టార్గెట్ చేసి తీసిన సినిమా కాదని అంటున్నాడు వర్మ. ఇక కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయాలనే సినిమాలో చూపిస్తున్నా అని అన్నారు ఆర్జివి.

 

కమ్మ, రెడ్డిలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను చెప్పట్లేదని అన్నారు. సినిమాలో విలన్ హీరోలు ఉండరని.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పానని అన్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో చంద్రబాబుని టార్గెట్ చేసిన ఆర్జివి మరోసారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా మళ్లీ బాబుపై గురి పెట్టాడు. 

 

మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. జగన్ సిఎం గా ప్రమాణస్వీకారం చేస్తున్న టైంలో ఈ సినిమా ఆలోచన వచ్చిందని అన్నారు ఆర్జివి. మాములుగానే వర్మ సినిమాలంటే రిలీజ్ కు ముందు గొడవలు జరగడం కన్ ఫాం.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ ఎలా ఉండబోతుంది.. సినిమాలో ఆర్జివి ఏం చూపించబోతున్నాడు అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు ఆర్జివి అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: