సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయ‌న్న అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టి నుంచే మంచి ఆస‌క్తి ఉంది. ఇక మ‌ధ్య‌లో ఏమైందో గాని ఇద్ద‌రు హీరోలు ఒక గంట తేడాలో జ‌న‌వ‌రి 12నే త‌మ సినిమాలు వ‌స్తాయ‌ని పోటీగా పోస్ట‌ర్లు రిలీజ్ చేసుకోవ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.

 

అప్ప‌టి నుంచి ఈ రెండు సినిమాల మ‌ధ్య ఇండ‌స్ట్రీలో అప్ర‌క‌టిత యుద్ధ‌మే న‌డిచింది. సినిమా విడుదలలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. అల్లుఅర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక మహేష్‌ సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ చేసి… రికార్డ్స్ బ్రేక్ చేశాడు.

 

ఇక రిలీజ్ డేట్లు రెండు సినిమాలు ఒకే రోజు ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అల్లు అర్జున్‌, మ‌హేష్‌బాబు మ‌ధ్య కోల్డ్‌వార్ ఉంద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మ‌ధ్య‌లో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రాజీ చేశార‌ని.. స‌రిలేరు 11న వ‌స్తుంటే.. అల వైకుంఠ‌పురంలో 12న వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. ఈ రిలీజ్ డేట్లు మార్చేందుకు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఎంతో ఫైట్ చేయాల్సి వ‌చ్చింది. 

 

రాజీ క‌దిరినా వీరి మ‌ధ్య వార్ అలాగే ఉంది. మహేష్ టీజర్ రిలీజ్  చేసిన రోజే పోటీగా అల్లుఅర్జున్‌ మూడో సాంగ్ రిలీజ్  చేయటం విశేషం. ఇక ఇప్పుడు మరో సారి ఈ టాప్ హీరోలు పోటీకి సిద్ధం అవుతున్నారు. డిసెంబర్ 1 న అల వైకుంఠపురంలో సినిమా టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. అదే రోజు సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు కోల్డ్‌వార్ ఆపితే అంద‌రికి మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: