మాటల మన్తడికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అనేది మెజారిటీ ప్రేక్షకులు చెప్పే మాట. ఇక మొదట్లో పలు సినిమాలకు కథలు, మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారడం జరిగింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో అతడు సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్. దాని తరువాత పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా తీయడం జరిగింది. అయితే త్రివిక్రమ్ తీసిన ఆ మూడు సినిమాలు కూడా ఎంతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడిగా త్రివిక్రమ్ కు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. 

 

ఇక ముఖ్యంగా ఆయన సినిమాల్లోని డైలాగ్స్ కు ఫిదా అవ్వని వారు ఉండరు అనే చెప్పాలి. ఇకపోతే గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన తీసిన అజ్ఞాతవాసి సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒక ప్రఖ్యాత ఫ్రెంచ్ సినిమా కథను అచ్చంగా ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టి త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా తీసారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో కలిసి ఆయన తీసిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ అందుకుని, మళ్ళి కెరీర్ పరంగా త్రివిక్రమ్ కి మంచి ఊపునిచ్చింది. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో అనే సినిమాను తీస్తున్న త్రివిక్రమ్

 

సినిమా కథను కూడా గతంలో వచ్చిన ఇంటిగుట్టు అనే సినిమా కథను మూలంగా తీసుకుని తెరక్కిస్తునంట్లు నిన్నటి నుండి కొన్ని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ సినిమా మాదిరిగా ఈ సినిమాలో కూడా ఇద్దరు స్నేహితులకు బిడ్డలు పుట్టి వారు తారుమారు కావడం, ఆ తరువాత చివరకు కొన్ని పరిణామాల అనంతరం వారు తమ అసలు తలితండ్రుల వద్దకు చేరడం జరుగుతుందట. అయితే ఈ విషయమై మరొక కాపీ సినిమా తీస్తున్నారా గురూజీ అంటూ త్రివిక్రమ్ పై కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయవలసిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: