సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.   ఇప్ప‌టికే  రిలీజ్ అయిన `దర్బార్` మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. లేటెస్ట్ గా ` దర్బార్` చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 

 

దుమ్ము- ధూళి...నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు....అంటూ రజినీకాంత్ 'దర్బార్' ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా  గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు.  రజిని మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయ‌న స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ స్వరపరిచారు.  ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను  చూపించాడు.  'దర్బార్' చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

 

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: