టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ‘ముకుంద’ మూవీతో వెండి తెరకు పరిచయం అయినా.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ‘కంచె’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ మూవీలో ఫుల్ మాస్ లుక్ తో కనిపించాడు. ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయినా.. వరుణ్ తేజ్ కి మాత్రం మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ సూపర్ హిట్ తర్వాత మనోడికి వరుసగా సినిమాలు కలిసి వస్తున్నాయి. ఈ ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మంచి విజయాలు అందుకున్నాయి.
కొత్తదనం కలిగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో చేయనున్నాడు. ఈ మూవీలో మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు అవసరమని.. కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి నిధి అగర్వాల్ ను - నభా నటేశ్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ ఏడాడి పూరి జగన్నాథ్ ఎంతో కసిగా తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో హీరో రామ్ సరసన నటించిన విషయం తెలిసిందే. అందాల ఆరబోతతో ఈ ముద్దుగుమ్మలు కుర్రాళ్ల మనసు దోచారు. ఈ ఇద్దరు హీరోయిన్లు ఖాయమైతే, ఈ ప్రాజెక్టు క్రేజ్ పెరిగిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.