మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో.  ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్  డిసెంబ‌ర్ ఎండింగ్ నాటికే సినిమా ఫ‌స్ట్ కాఫీ కంప్లీట్ చేసేయాల‌న్న టార్గెట్‌తో దూసుకు పోతున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ కావ‌డంతో నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు సాంగ్స్ ను రిలీజ్ చేశారు. మరోవైపు డబ్బింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు సోష‌ల్ మీడియాలో సాంగ్స్ దుమ్ము రేపుతుండ‌డంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఈ కాంబోలో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

 

ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ సినిమా ఫ‌స్ట్ కాపీని రిలీజ్ డేట్‌కు 10 రోజుల ముందే కంప్లీట్ చేసేసి.. సెన్సార్‌కు పంపేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. మురళీ శర్మ, పూజా హెగ్డేలు గత రెండు రోజులుగా డబ్బింగ్ చెప్తున్నారు.  వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే బన్నీ సుకుమార్ సినిమా మొదలౌతుంది.  

 

దాదాపుగా వచ్చే నెల నుంచి సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  సుకుమార్ సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయాలని బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.  అందులో రష్మిక మందన్న హీరోయిన్.  రంగ‌స్థ‌లం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత సుకుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రి బ‌న్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క‌థ కూడా రంగ‌స్థ‌లంలా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: