సంచనల దర్శకుడు రాం గోపాల్ వర్మ నుండి ఒక సినిమా వస్తుందంటే..ఆ సినిమాకి రావలిసినంత క్రేజ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రీ పబ్లిసిటి కూడా మామూలుగా ఉండదు. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నా వర్మ కి మాత్రం విపరీతమైన పాపులారిటి ఉంది. ఆ మధ్య వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో కూడా ఎన్నో సంచలనాలను సృష్ఠించాడు. ఇక తాజాగా వరం తెరకెక్కించిన  సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాను రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన వర్మ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకి సంబంధించి ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

 

సినిమాలో పవన్ కళ్యాణ్ ను పోలిన ఓ పాత్ర , ఆ పాత్ర పెట్టే 'మనసేన' అనే పార్టీ వుంటుందని అన్నారు. జనసేనకు మనసేనకు సంబంధం లేదని మీడియా మీద ఒట్టేసి చెబుతున్నా అన్నారు. ఒకరకంగా ఇది పవన్ కళ్యాణ్ ని అవమానించినట్టుగా సెటైరికల్ గా మాట్లాడారు. తన కెరీర్ లో తొలిసారి తను తీసిన మెసేజ్ ఓరింయెంటెడ్ సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఆర్జీవీ అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని వర్మ చమత్కరించారు. 2019 నుంచి 2020 మధ్యకాలంలో జరిగింది అనే కథను ఊహించి ఈ సినిమా చేసానని అన్నారు. సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదన్నారు. తను ఏ కులాన్ని ఎక్కువ, తక్కువ చేయడం లేదన్నారు. గతంలో జరిగినవి సినిమాలుగా తీసానని, ఇప్పుడు జరుగుతుందని భావించినవి సినిమాగా తీసానని అన్నారు. 

 

ఇది ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే అని అందరికి క్లారిటి ఇచ్చారు. సినిమాలో వున్న పాత్రలు అన్నీ కల్పితం, పాత్రలు-నిజ జీవిత పాత్రలకు మధ్య పోలికలు యాధృచ్చికం అని ఆయన అన్నారు. ఇది తప్పు అని అంటే బాలాజీ తనను శిక్షిస్తాడని ఆయన చెప్పారు. పప్పు సీన్ ట్రయిలర్ లో చూసి చాలా మంది తెలుగుదేశం నాయకులే తనకు ఫోన్ చేసి అభినందించారని అన్నారు. బహుశా వాళ్లు పీల్ అయి, చెప్పలేకపోయినది తాను చెప్పానని అలా చేసి వుంటారని అన్నారు. తన సినిమా మాంచి వింధు భోజనం లాంటిది అని అందుకోసమే చూడాలని ఆర్జీవీ అన్నారు. ఎప్పుడు నా సినిమా నచ్చకపోతే చూడకండి అని చెప్పే రాం గోపాల్ వర్మ ఇప్పుడు వింధు భోజనం లాంటి సినిమా అందుకే చూడండి అని చెప్పటం అందరికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: