సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో తారాస్థాయి అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ కు జోడీగా కన్నడ భామ రష్మిక మదన్న నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించగా సినిమా అవుట్ పుట్ పై చిత్రయూనిట్ అంతా సాటిస్ఫైగా ఉన్నారట. 

 

అయితే మహేష్ బాబు మాత్రం క్లైమాక్స్ విషయంలో కొద్దిగా అసంతృప్తిని వ్యక్తపరిచాడట. క్లైమాక్స్ అనుకున్నట్టుగా చేసినా అది సరిగా రాలేదని వేరే క్లైమాక్స్ ఆలోచించమని డైరక్టర్ కు చెప్పాడట. అనీల్ రావిపుడి మహేష్ ఆలోచనలకు గౌరవం ఇచ్చి క్లైమాక్స్ మార్చేలా ప్లాన్ చేశాడట. సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా నటిస్తున్నారు.

 

టీజర్ తో అంచనాలు పెంచిన మహేష్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే క్లైమాక్స్ ఆడియెన్స్ కు నచ్చేలా ప్లాన్ చేశాడట. అయితే మహేష్ చెప్పినట్టుగానే క్లైమాక్స్ మార్చారని తెలుస్తుంది. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నాడు. సినిమా దాదాపుగా కర్నూలు బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుందట. అయితే కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ ను ఆరెఫ్సీలో వేసి అక్కడ షూటింగ్ జరిపారు.

 

టీజర్ లో భయపడే వాడే బేరాల గురించి మాట్లాడతాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా అని మహేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మహేష్ ను ఇలా మాస్ క్యారక్టర్ లో చూసి చాలా రోజులవుతుంది. పటాస్ నుండి ఎఫ్ 2 వరకు వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపుడి మహేష్ లాంటి స్టార్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే అనీల్ వర్కింగ్ స్టైల్ నచ్చి మహేష్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. సరిలేరు  నీకెవ్వరు హిట్టైతే సెకండ్ మూవీ కూడా ఫిక్స్ అయినట్టే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: