సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటికే రిలీజ్ అయిన అఫీషియల్ టీజర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు కూడా ఆకాశమంత ఎత్తుకు చేరాయి అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారి మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే కొద్దిరోజులుగా మహేష్ బాబు ఎక్కువగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ రోల్స్ లోనే నటిస్తుండడం, అలానే ఆయన నుండి ఫ్యాన్స్ ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్ అంశాలు మిస్ అవడంతో, సరిగ్గా అటువంటి అంశాలతో పాటు పలు మాస్ అంశాలు కలగలిపి ఈ సరిలేరు నీకెవ్వరు సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్లు సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని రాబోయే సోమవారం యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. 

 

హీరో మరియు హీరోయిన్ల మధ్య తెరక్కించిన మంచి రొమాంటిక్ సాంగ్ ని తొలుత రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఎంతో అదిరిపోయిందని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పాట విన్న తరువాత ఎంతో ఖుషి అవడం ఖాయం అని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఒక్క పాట మాత్రమే కాక, సినిమాలోని మిగతా అన్ని పాటలు కూడా దేవి అదరగొట్టాడని అంటున్నారు. ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: