ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 70 శాతానికి పైగా తమ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుందని, ఇక మధ్యలో షూటింగ్ విషయమై కొద్దిపాటి అడ్డంకులు ఎదురైనప్పటికీ, సినిమాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ముందుగా అనుకున్న విధంగా వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేసి తీరుతాం అని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ కొమరం భీంగా, 

 

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, మరియు ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఆలియా భట్ తాలూకు పోర్షన్ షూటింగ్ మొత్తం నేటితో పూర్తి అయిందని, అందుకే ఆమె సినిమా షూటింగ్ అనంతరం నేడు నిష్క్రమించి ముంబై వెళ్లిపోయిందని టాలీవుడ్ వర్గాల టాక్. 

 

దాదాపుగా చాలారోజులుగా ఆలియా క్యారెక్టర్ షూటింగ్ చేసిన సినిమా యూనిట్, ఎట్టకేలకు ఆమె పాత్రను పూర్తి చేసి ఇంటికి పంపడంతో ఆలియా ఎంతో ఖుషీగా ఉందట. ఇక ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా పాత్ర చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. అతి త్వరలో ఎన్టీఆర్ మరియు ఒలీవియాల పై ఒక పాటను, మరియు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనుందట సినిమా యూనిట్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: