'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' అంటూ ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు వ‌రుణ్‌తేజ్‌. తాజాగా వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే వరుస విజయాలతో వరుణ్ తేజ్ తన దూకుడు చూపిస్తున్నాడు. కొత్తదనం కలిగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. అలాంటి వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

 

వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కావడంతో, కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి నిధి అగర్వాల్ ను - నభా నటేశ్ ను ఎంపిక చేసినట్టుగా స‌మాచారం. 'ఇస్మార్ట్ శంకర్'లో ఈ అందగత్తెలు ఏ రేంజ్ లో అందాలు ఆరబోశారో తెలిసిందే. వీళ్ల ఎంపిక ఖాయమైతే, ఈ ప్రాజెక్టు క్రేజ్ పెరిగిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

మరి వరుణ్ తేజ పాత్రకు ఎంత మంది కనెక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటివరకు వరుణ్ సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చి సడన్ గా రూట్ మార్చి గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. ఇక ఈ కొత్త చిత్రంలో ఒక స్పోర్ట్స్ నేప‌ధ్యంలో తెర‌కెక్కే ఈ చిత్రం ఏవిధంగా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

 

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నభానటేష్, నిధి అగర్వాల్ లు తిరిగి మ‌రోసారి వారి అందాల‌ను ఆర‌బొయ్య‌డానికి రెడీ అయిపోతున్నారు. అయితే ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ రెమ్యూన‌రేష‌న్ కూడా అమాంతం పెంచేశార‌ట‌. ఇద్ద‌రూ ఒకేమాట మీద ఉండి  కొత్త ఆఫర్ వస్తే ఎనభై లక్షలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: