ఈ మద్య దేశంలో మానవ సంబంధాలు అనేవే లేకుండా పోతున్నాయి.  అగ్ని సాక్షిగా ఒక్కటైన దంపతులు క్షణిక సుఖానికి బానిసై సొంతవారినే దారుణంగా హతమారుస్తున్నారు.  నూరేళ్లూ మనసా.. వాచా.. కర్మేణా కలిసి ఉంటామని బాస చేసుకున్న భార్యాభర్తలు.. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితి నెలకొంటుంది.  తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపించిన ఘటనలు.. నమ్మకంగా ఉంటూ భార్యను దారుణంగా హతమారుస్తున్న భర్తల దారుణాలు ఈ మద్య చాలా వెలుగు వచ్చాయి.  తాజాగా ఈ జాఢ్యం సెలబ్రెటీలకు కూడా పాకింది. ప్రముఖ పాపులర్ సింగ్, కోలివుడ్ సినీ గాయకుడు పళని అలియాస్ పజని కుమారుడు, యువ గాయకుడు ధరణి (34) తో సహ అతని కుటుంబ సభ్యులను వరట్నం వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు.   

 

వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల ధరణి తన స్నేహితురాలైన విజయ భానుని మూడేళ్లు ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి సమయంలో విజయ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో కట్న, కానుకలు సమర్పించారు.  పెళ్లైన కొత్తలో వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది.  కొంతకాలంగా ధరణి తనకంటే పదేళ్లు పెద్దదైన నిత్యా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.  ఆ విషయం విజయ భానుకు తెలియడంతో నిలదీసింది. తన అక్రమ సంబంధం బయట పడిందన్న ఆక్రోశం..నన్నే ప్రశ్నిస్తావా అంటూ కోపంలో విచక్షణ రహితంగా కొట్టాడని శారీరకంగా చిత్ర హింసలు పెట్టాడంటూ విజయ భాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.  

 

నిత్యా అనే మహిళకు గతంలోనే రెండు పెళ్లిళ్ళు జరిగాయి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధరణితో సంబంధం పెట్టుకొని మరో బిడ్డకి జన్మనిచ్చినట్లుగా విచారణలో తేలింది. కాగా, ధరణి భార్యను శారీరకంగా వేదించడంతో పాటు అదనపు కట్నం కోసం చిత్ర హింసలు పెట్టినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధరణికి సాయంగా నిలిచారణ ఆరోపణతో ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: