మూవీ క్రిటిక్ కత్తి మహేష్... అప్పుడు వరకు చాలా మందికి తెలియని కత్తి మహేష్ ఒకే సారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి  అందరికి చూపులో  పడ్డారు .  పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కత్తి మహేష్. ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఆయన పై సెటైర్లు వేస్తూనే ఉంటారు. కొంతమంది కత్తి మహేష్ కు నోటి దురుసు ఎక్కువ అంటుంటారు. కానీ కత్తి మహేష్ మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరో సారీ పవన్ కళ్యాణ్ పై ఘాటు  వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు కత్తి మహేష్. రాయలసీమ వాసుల్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఘాటు పదజాలంతో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తాను  పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ఘాటు పదజాలాన్ని  వాడను... పవన్ కళ్యాణ్ ఫాన్స్ అన్నట్లుగా నేనేమైనా అన్నానా... ఒరేయ్ అని ఉంటా అంతే.అది  పెద్ద నేరం కాదు నేను గౌరవించే వాళ్లను గౌరవించే వాళ్ళని గారు అని గౌరవించని వాళ్ళను ఒరేయ్ అని అంటూనే  ఉంటా అంటూ కత్తి మహేష్ అన్నారు . 

 


 తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బానిస కుక్క అన్నది  నిజమేనని ఆ మాటకు కట్టుబడి ఉంటానని కత్తి మహేష్ అన్నారు. తను తెలుగు దేశం పార్టీ  బానిస కుక్కకు కాదని  పవన్ కళ్యాణ్ నిరూపించమనండి  చూద్దాం అంటూ కత్తి మహేష్ సవాల్ విసిరారు. తాను ఎపుడైనా  పవన్ కళ్యాణ్ గురించి ఘాటు పదజాలం వాడాను  అంటే అది ఒక్క రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రమే అంటూ కత్తి మహేష్ అన్నారు. తాను  రాయలసీమ వాసిని  అని... ఎన్నో ఏళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని...  నీటి విషయంలో అయినా రాజధాని విషయంలో అయినా... పాలకులు మారిన రాయలసీమకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. దీని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్... జగన్ రాయలసీమ వాసి కాబట్టి కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి ఇడుపులపాయలో రాజధాని పెట్టుకుని అంటూ రాయలసీమ వాసులను  కించపరిచేలా మాట్లాడటం  ఎంతో బాధ కలిగించింది అంటూ కత్తి మహేష్ అన్నారు. 

 


 పవన్ కళ్యాణ్ కర్నూలు కి వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు నా మనసులో రాజధాని కర్నూలు అని అంటారు... చంద్రబాబు దగ్గరకు వెళ్లగానే రాజధాని అమరావతి అంటూ పవన్ కళ్యాణ్ మాట మారుస్తారు . రాయలసీమ వాసులను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే తాను  సైలెంట్గా ఉండలేనని  అందుకే ఘాటైన పదజాలం వాడినట్టు కత్తి మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయడం నా పర్సనల్ అజెండా కాదు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయటం  తన పర్సనల్ అజెండాగా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై కోడిగుడ్లతో దాడి చేసి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి అభినందనలు పొందినప్పుడే కామెంట్ చేసేవాన్ని అంటూ కత్తి మహేష్ అన్నారు.

 

 

చంద్రబాబు అయిన జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా రాయలసీమ వాసుల గురించి తప్పుగా మాట్లాడితే... నేను స్పందించే తీరు ఇలాగే ఉంటుంది అంటున్నారు కత్తి మహేష్ తెలిపారు. రాయలసీమ వాసుల ఆశలపై నీళ్లు చళ్లే  ప్రయత్నాలు చేస్తే తాను స్పందిస్తానని  తన  పదజాలం కూడా మారుతుంది అంటూ వ్యాఖ్యానించారు  కత్తి మహేష్. మరోమారు రాయల సీమవాసులను  కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు గుండు గీయించటంతో  పాటు ఇంటికి వెళ్లి మరి కొడతానేమో అంటూ వార్నింగ్ ఇచ్చారు కత్తి మహేష్. సీమ అనేది మా భూమి సీమవాళ్లు మా వాళ్లు వాళ్ల గురించి తక్కువగా మాట్లాడితే ఘాటుగా సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ మరోసారి మా మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది అంటూ కత్తి మహేష్ ఘాటు విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: