స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో..  నుండి  ఇటీవలవిడుదలైన  మొదటి సాంగ్  సామజవరగమన  97మిలియన్ల  వ్యూస్ తో  అత్యధిక లైకులను  తెచ్చుకున్న మొదటి  తెలుగు సాంగ్ గా  రికార్డు సృష్టించింది.  ఈఒక్క సాంగ్ తో సినిమా పై అంచనాలు  భారీగా పెరిగిపోయాయి.  ఇక ఈ సాంగ్ తరువాత కొద్దీ రోజుల క్రితం  ఈ సినిమా నుండి  రెండవ సాంగ్  రాములో  ..రాముల  కూడా  విడుదలకాగా ఈ సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 
 
ఇక ఈసాంగ్ 72మిలియన్ల వ్యూస్ తో  7లక్షల పైచిలుకు   లైకులతో అత్యధిక  లైకులను రాబట్టుకున్న  రెండవ తెలుగు సాంగ్ గా  రికార్డు సృష్టించింది.   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  శరవేగంగా  జరుగుతుంది.     మాటల  మాంత్రికుడు  త్రివిక్రమ్ డైరెక్షన్  లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  బన్నీ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా  జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం  తెలుగు తోపాటు మళయాలం లోనూ విడుదలకానుంది.
 
 
ఇక బన్ని -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  అయ్యాయి.  మరి  ఈ అల... వైకుంఠపుములో  వీరిద్దరికి  హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈసినిమా  తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో    కూడా  అల్లు అర్జున్  నటించనుండడంఇది  మూడో సారి.  

మరింత సమాచారం తెలుసుకోండి: