ప్రఖ్యాత సంచలన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అటు బాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు తీసి మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇటీవల మాత్రం టాలీవుడ్ లో ఆయన తీస్తున్న సినిమాలు అన్ని కూడా పరాజయాలు పాలవుతున్నప్పటికీ ఆయన మాత్రం విజయం కోసం వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన తీస్తున్న వివాదాస్పద సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తదితర పొలిటికల్ లీడర్స్ పై సెటైరికల్ గా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 

అలానే ఈ సినిమా ద్వారా ప్రముఖ మత ప్రబోధకుడు కేఏ పాల్ పై కూడా వ్యంగ్యాస్త్రాలు పేల్చనున్నారు వర్మ. కొద్దిపాటి వివాదాలకు కారణంగా నిలుస్తున్న ఈ సినిమా, రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాతో పాటు వర్మ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్షల్ ఆర్ట్స్ మూవీ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. ఈ సినిమా అఫీషియల్  టీజర్ నిన్న యూట్యూబ్ లో విడుదల చేసి మరో సంచలనానికి తెరలేపారు వర్మ. ఇండో, చైనీస్ కొలాబరేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యత సంపాదించ అమ్మాయిగా నూతన నటి పూజా భాలేకర్ నటించింది. ఆ కొత్త అమ్మాయి అందాల ఆరబోతతో పాటు మంచి యాక్షన్, ఫైట్స్ కలబోతగా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక ఈ టీజర్ చూసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కురిపించారు. తన ట్విట్టర్ వేదికగా ఆ సినిమా టీజర్ బాగుందని చెప్పిన అమితాబ్, వర్మకి బెస్ట్ విషెస్ అని చెప్పారు. బాలీవుడ్ లో వర్మ అమితాబ్  తో కలిసి పలు సినిమాలు తీయగా వాటిలో 2005లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటివరకు వీరిద్దరూ సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ ఇలా అరడజనుకు పైగా సినిమాలకు కలిసి పని చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని, అలానే అతి త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు వర్మ.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: