రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలు ఎప్పుడూ ఏదో ఏదో ఒక వివాదంలో తలదూర్చే రాంగోపాల్ వర్మ తాజా గా మరో వివాదాస్పద మూవీ విడుదలకు సిద్ధం అయింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని వివాదాలు చుట్టుముట్టడంతో అమ్మ రాజ్యంలో కడప రెడ్లు గా మార్చారు. ఇక ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాంగోపాల్ వర్మసినిమా తీసిన డబ్బులు ఖర్చు పెట్టకుండా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అందుకు ఈ సినిమా ఏం మినహాయింపు కాదు. 

 

ఇక ఆర్జీవీ కెరీర్లోనే అత్యంత వివాదాస్పదం అయిన మూవీ జీఎస్టీ అంటే గాడ్ సెక్స్ ట్రూత్, మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ తో రాంగోపాల్ వర్మసినిమా తీసాడు. "ఇప్పుడైనా భవిష్యత్తులో మరెప్పుడైనా సరే సెక్స్ ఒక్కటే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైంది" అంటూ 19 నిమిషాల నిడివిగల ఈ సినిమా సోషల్ మీడియా సైట్లలో విడుదలై ఆర్జీవీ కి డబ్బుల వర్షం కురిపించింది. పొర్ణమి స్టార్ తో సినిమా అదీ ఈ పోర్న్ స్టార్ సినిమా మొత్తం ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా నటిస్తోంది అని తెలిసి మహిళ సంఘాలు రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. 

 

ఒక ప్రముఖ టీవీ లో చర్చ సందర్బంగా ఓ మహిళ సంఘానికి చెందిన కార్యకర్తను ఉద్దెశించి "నువ్వు బాగా అందంగా ఉన్నావు. వచ్చే సినిమా నీతోనే తీస్తా" అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యడంతో వివాదం పెద్దది అయింది. ఎన్నో వివాదాలను దాటుకుని గత సంవత్సరం జనవరి 27 న ఈ సినిమా యూట్యూబ్ లో విడుదల అయింది. సినిమా చూడాలంటే రూ 150 చెల్లించాలని నిబంధన పెట్టగా ఎవ్వరూ ఊహించనంత వ్యూస్ వచ్చాయి ఈ మూవీ కి దీనితో 19 నిమిషాల సినిమా రాంగోపాల్ వర్మకు రూ 15 కోట్లు సంపాందించి పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: