విజయాలు లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా సినిమా పరిశ్రమలో ఎవరూ, ఎవర్నీ గుర్తించారు.హీరోల దగ్గర నుంచి దర్శకుల దాక ఇదే ఫార్మలా అనుసరిస్తూ ఉంటారు. నిర్మాతలైతే పరజయంలో ఉన్న వారి వంక కన్ను ఎత్తి కూడా చూడరు. కానీ నిర్మాతగా ఈరోజు టాప్ స్థాయి లో ఉన్న దిల్ రాజ్ ప్రవర్తన ఈ విషయంలో విభిన్నం.  ‘మున్నా’ లాంటి ఫ్లాప్ సినిమాను తీసిన దర్శకుడు వంశీ పైడి పల్లికి ‘బృందావనం’ సినిమాకు అవకాసం ఇచ్చాడు. అలాగే అతడి పై ఎంతో నమ్మకం ఉంచి ‘ఎవడు’ తీసాడు ఇక లేటెస్ట్ గా దిల్ రాజ్ ‘ఓమై ఫ్రెండ్’ సినిమాను తీసి ఫ్లాప్ రికార్డును తలకెత్తుకున్న వేణు శ్రీరామ్ తో వచ్చే సంవత్సరం ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే ఫ్యామిలీ మల్టీ స్టారర్ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లోని ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిపి నిర్మిస్తాడు అనే విషయాన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.  అదేవిధంగా గతంలో ‘జోష్’ సినిమాను తీసిన వాసు వర్మతో కూడా దిల్ రాజ్ వచ్చే సంవత్సరం ఒక మంచి సినిమా చేయబోతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.న ఈ మాటలను బట్టి చూస్తూ ఉంటే దిల్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఫైల్యూర్ దర్శకుల పాలిత లివింగ్ గాడ్ గా మారిపోయాడు అంటు మాటలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: