పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారంటు వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే ఈ సినిమా ముందు చేస్తాడా లేక వేరే సినిమా ముందు చేస్తాడా అన్నది క్లారిటి అయితే లేదు గాని పింక్ రీ మేక్ కి మాత్రం మొదట్లోనే అవాంతరాలు, గాసిప్స్ బాగా వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి మాటల మాంత్రీకుడు డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-నిర్మాణ సంస్థ హారిక హాసిని పక్కకు తప్పుకున్నట్లు తాజా సమాచారం. పవన్ కళ్యాణ్ నటిస్తుండటంతో పింక్ రీమేక్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ తయారుచేయడానికి, హారిక హాసిని సంస్థ భాగస్వామ్యం తీసుకోవడానికి ముందు నుంచి ఉత్సాహంగా ఉన్నారు. 

 

కానీ మధ్యలో ఏం జరిగిందో కానీ, ఇప్పుడు త్రివిక్రమ్, హారిక రెండూ మిడిల్ డ్రాప్ అయినట్లేనని లేటెస్ట్ న్యూస్. నిర్మాత దిల్ రాజు వ్యవహార శైలి, వేణు శ్రీరామ్ తో స్క్రిప్ట్ రాయించుకోవాలనే ఆయన ఆలోచన పసిగట్టిన త్రివిక్రమ్-హారిక తప్పుకున్నట్లు వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి త్రివిక్రమ్-హారిక తప్పుకున్నారు అని తెలిసిన తరువాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది.  ఇక కుటుంబ పరంగా వైకాపా బంధాలు వున్న దిల్ రాజు ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తే, రాజకీయంగా కూడా సమస్య అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ చాలా ఎక్కువగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

 

అలాంటి టైమ్ లో వైకాపా ఎమ్మెల్యేతో సంబంధం కలుపుకున్న దిల్ రాజు ఈ నిర్మాణం చేపట్టడం అంత సరైనది కాదు అనే డిస్కషన్ వైకాపా టాప్ వర్గాల్లో మొదలయిందని మరో గాసిప్ కూడా అక్కడా ఇక్కడా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలపై దిల్ రాజు గాని పవన్ కళ్యాణ్ గాని స్పందిస్తే క్లారిటి వస్తుంది. ఇక దిల్ రాజు 2020 సంక్రాంతికి రెండు భారీ ప్రాజెక్ట్స్ ని రెడీ చేస్తున్నారు. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కాగా మరోటి అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో. ఒక సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా..బన్నీ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు బనీ-త్రివిక్రం లకు ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: