‘బాక్సాఫీస్‌ వద్ద  నా సినిమాలు ఆడినా.. ఆడకపోయినా  పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా తప్పకుండ నేను  ప్రతీకారం తీర్చుకుంటాను’  అని అంటున్నాడు మన రౌడీ విజయ్‌ దేవరకొండ. ఈ మధ్యకాలం లో విజయ్ తీసిన సినిమాలు అంతంతమాత్రానే వున్నాయి . ఇటీవల విజయ్‌ తీసిన  సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి.

 

దీనిపై  విజయ్ స్పందిస్తూ  ఈ  విధంగా మాట్లాడారు .. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు అంతగా ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు  కూడా సినిమాలు చూస్తూ మధ్యలోనే  వెళ్ళిపోయేవారు .. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో  షేరు చేసుకునేవార’ని తెలిపారు.

 

ఇటివల ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమం గోవాలో నిర్వహించారు ఈ  కార్యక్రమానికి విజయ్ కూడా వచ్చారు .ఈ  నేపథ్యంలో విజయ్‌  మాట్లాడుతూ...ఓ చిన్న అమ్మాయి ‘డియర్‌ కామ్రేడ్‌  సినిమాపై  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయంలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డియర్‌ కామ్రేడ్‌లోని మొదటి సగ భాగం మాత్రమే తనకు నచ్చిందని రెండవ భాగం నచ్చలేదని చెప్పింది. అది నిజమైన విమర్శ.. అని దానిని విజయ్  అంగీకరిస్తాన అని చెప్పాడు . అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్టపడతాన’ని తెలిపాడు.

 

 విజయ్‌ సినీ పరిశ్రమల్లో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ‘ఇది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ఇలా చాలా అంశాల మీద  ప్రభావం ఉంటుంది. నేను సినిమాల్లోకి ఏదైతే అనుకున్నానో అది చేయడానికే  వచ్చాను. నేను సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకపొతే .. నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: