అల్లుడు సీను సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమాకే సమంత లాంటి స్టార్ హీరోయిన్..వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ ఉన్నప్పటికి ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అప్పటి నుంచి కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్, టాప్ డైరెక్టర్స్ తో చేసినప్పటికి శ్రీనివాస్ కి ఒక్క భారీ హిట్ పడలేదు. ఏదో బోయపాటి పుణ్యమా అని ఒక యావరేజ్ సినిమా పడింది. ఇక చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక సూపర్ హిట్ రీమేక్ సినిమా 'రాక్షసుడు' తో అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా ఓ యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కే సినిమా అని సమాచారం. ఇక ఈ సినిమాకోసం తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పటికే సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో రెడీ అయ్యాడు శ్రీనివాస్. అంతేకాదు గడ్డం కూడా పెంచి కొత్త మేకోవర్ తో కనిపిస్తున్నాడు.

 

ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించడానికి ఈ సారి స్టార్ హీరోయిన్ ని వద్దనుకున్నాడు. అందుకే ఇస్మార్ట్ గ్లామర్ బ్యూటిని ఎంచుకున్నారట. ఈమధ్య 'ఇస్మార్ట్ శంకర్'లో ఒక హీరోయిన్ గా నటించి రామ్ తో కలిసి ఫుల్ మాస్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ ని సెలెక్ట్ చేసుకున్నాడని లేటెస్ట్ అప్‌డేట్. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తో నభా నటేష్ కు డిమాండ్ పెరిగింది. వరుసగా సినిమాలు కమిటవుతోంది. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ తో డిస్కో రాజా సినిమాతో పాటు మెగా హీరోతోను నటిస్తోంది. అందుకే ఈ సినిమాలో బెల్లకొండ బాబు కోసం ఈ బ్యూటిని ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ గా వెల్లడించనున్నారని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేసి.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని చిత్ర యూనిట్ అంటున్నారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటు నభా నటేష్ ఇద్దరూ సక్సెస్ లో ఉన్నారు. మరి ఇద్దరు కలిసి నటించబోయే ఈ సినిమా ఇద్దరికి కలిపి భారి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక బెల్లకొండ శ్రీనివాస్ తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా అన్న నే హీరో గా మంచి కమర్షియల్ సక్సస్ కోసం పాకులాడుతుంటే ఇప్పుడు తమ్ముడి ఎంట్రీ అవసరమా అని కొందరు కామెంట్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: