సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, రఘు బాబు, రావు రమేష్, సుబ్బరాజు, సంగీత, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించడంతో పాటు సినిమాపై తారా స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసింది. 

 

ఇక ఈ సినిమా నుండి తొలిపాటను రాబోయే సోమవారం రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాను పక్కాగా సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ఒక సెంటిమెంట్ దాగి ఉందట. గతంలో మహేష్ బాబు హీరోగా జనవరి నెలలో వచ్చిన సినిమాల్లో ఒక్కడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో, ఈ సినిమాను కూడా జనవరిలో రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టాలని మహేష్ భావించారట. 

 

కాగా అదే సంక్రాంతి సీజన్ లో వచ్చిన మహేష్ సినిమాల్లో వన్ నేనొక్కడినే, టక్కరి దొంగ సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. అలానే అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, ఎఫ్2 సినిమాలు జనవరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించాయి. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఈ జనవరి సెంటిమెంట్ ఈసారి వీరిద్దరికి కలిసి వస్తుందని గట్టిగా నమ్మకంగా ఉన్నారట. మరి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న రిలీజ్ కాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధించి వారి సక్సెస్ సెంటిమెంట్ ని నిలబెడుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: