టాలీవుడ్ లో తెలుగమ్మాయిల హవా మెల్లగా పెరుగుతోంది. అందానికి అందం.. ప్రతిభ ఉన్న అమ్మాయిలు ఒక్కొక్కరుగా తెరమీదకి వస్తున్నారు. సోషల్ మీడియా వెల్లువలో తెలుగమ్మాయిలకు ఫోకస్ బాగా పెరిగింది. ఆ కోవలోనే లఘు చిత్రాలతో ఆకట్టుకున్న బ్యూటీ పూజిత పొన్నాడ ఎప్పుడు ఇన్ స్టాగ్రాం లో హాట్ హాట్ ఫోటోషూట్లతో జనాల మీద పడుతు భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ముందు లఘు చిత్రాల్లో నటించిన ఈ అమ్మాయిని పిలిచి ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

రంగస్థలం సినిమాలో చరణ్ అన్నగా నటించిన ఆది పినిశెట్టి ప్రేమించే అమ్మాయిగా కీలక పాత్ర పోషించింది. ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సినిమాలో నటించిన తెలుగమ్మాయిగా పూజితకు ఫోకస్ బాగానే వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజై లక్ చెక్ చేసుకుంది. అయితే స్టార్ హీరో రేంజు ఆఫర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. చెన్నయ్ లో స్టడీ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన పూజితకి నెమ్మదిగా అవకాశాలు పెరుగుతున్నా.. పెద్ద స్థాయికి చేరే జాక్ పాట్ అయితే తగల్లేదని ఇంతకాలం బాధ పడింది.

 

అయితే తాజా సమాచారం ప్రకారం మరోసారి లెక్కల మాస్టార్ సుకుమార్ నుంచి పిలుపు అందిందట. మళ్ళీ తన సినిమాలో పూజాకి అదిరిపోయే క్యారెక్టర్ ని ఆఫర్ చేశాడట. అది కూడా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఏఏ20లో ఈ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. తిరుపతి శేషాచల అడవుల నేపథ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిత్తూరు యాసకు ఎక్కువ ప్రాధాన్యత ఉందట. ఇక ఈ సినిమాలో పూజిత పొన్నాడకు ఎలాంటి పాత్రని ఆఫర్ చేశారన్నది తెలియాల్సి ఉంది. తెలుగమ్మాయి పూజిత అందం చందంలో ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆ రెండిటితో పాటు ప్రతిభలో రష్మిక మందనను డామినేట్ చేసేస్తుందేమో చూడాలి. ఒకవేళ అదే గనక జరిగితే వరుసగా పెద్ద సినిమాలలో ఛాన్స్ రావడం పక్కా. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: