టాలీవుడ్ లో మిస్టర్ కూల్ అనదగ్గవారిలో కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఉంటాడు. తన సినిమాలేవో తనవి.. తన పనేంటో తనది.. తన బిజినెస్ తనది. ఎటువంటి కాంట్రవర్సీలోకి ఎంటర్ కాడు. ముఖ్యంగా హీరోల నెంబర్ గేమ్ లోకి అసలేమాత్రం ఎంటర్ కాడు. తోటి హీరోలతో సినిమా క్లాష్ వచ్చినా పట్టింపులు ఉండవు. తన స్థాయికి తగ్గట్టే బిజినెస్, సెంటర్లు, ధియేటర్లు ఉండేలా చూసుకుంటాడు. అటువంటి నాగార్జునకు రీసెంట్ గా విసుగు తెప్పించారు అభిమానులు. అయితే.. దీనికి నాగార్జున తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు.

 

 

రీసెంట్ గా నాగార్జున వెకేషన్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లాడు. వెకేషన్ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ కు బయలుదేరాడట నాగార్జున. గోవాలో ఫ్లైట్ ఎక్కిన నాగార్జునను చూసిని ఆయన అభిమానులు నాగార్జునతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారట. అయితే అభిమానుల తాకిడి ఎక్కవ కావడంతో నాగార్జున ఇబ్బందిపడ్డాడట. వెంటనే ఫ్లైట్ సిబ్బందితో తన సీట్ ప్లేస్ మార్చాలని కోరాడట. వెంటనే సిబ్బంది ఆ ఏర్పాట్లు చేయడంతో నాగ్ ఊపిరి పీల్చుకున్నాడట. వెకేషన్ మూడ్ నుంచి ఓ అత్యవసర పనిపై గోవా నుంచి నాగ్ బయలుదేరాడని సమాచారం.

 

 

ఈ వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిజానికి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఏం చేస్తాడో తెలిసిన విషయమే. కానీ.. నాగార్జున సహనం కోల్పోకుండా కేవలం తన సీట్ ను మార్చాలని మాత్రమే కోరడంతో నాగ్ తీరును మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీల విషయంలో వారి ప్రైవేట్ స్పేస్ కు ఇబ్బంది కలిగించకూడదని పలువురు అంటున్నారు. వారి ఫ్రీ టైమ్ లో డిస్టర్బ్ చేయకూడదని అంటున్నారు.ఏమైనా నాగార్జున వ్యవహరించిన తీరుకు అభిమానులు హర్ట్ అయ్యేలా లేకపోవడం అభినందించాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: