మహర్షి తరువాత
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి పెద్దగా బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక కొద్దీ రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ 24మిలియన్ల పై చిలుకు వ్యూస్ ను రాబట్టి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ తో 5రోజులనుండి యూ ట్యూబ్ లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది.
ఈ క్రమంలో ఈ టీజర్ 5లక్షల లైకులను సొంతం చేసుకొని
టాలీవుడ్ లో
భరత్ అనే నేను ,
సాహో తరువాత అత్యధిక లైకులను సొంతం చేసుకున్న మూడవ టీజర్ గా సరిలేరు నీకెవ్వరు టీజర్ రికార్డు సృష్టించింది. తద్వారా మహేష్ రెండో సారి ఈ అరుదైన ఘనత ను సాధించాడు. ఇంతకుముందు భరత్ అనే నేను టీజర్ 6లక్షల 63వేలలైకులను రాబట్టగా సాహో టీజర్ 6లక్షల 9వేల లైకులను సొంతం చేసుకుంది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని రావిపూడి డైరెక్షన్ లో కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సరిలేరు నీకెవ్వరులో
మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ
బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వీరితో పాటు సీనియర్
హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మిల్కీ
బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ ,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా
జనవరి 12న విడుదలకానుంది.