వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..రాజకీయ పరిణామాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆలోచనలో పడేసింది.. సినిమా నుండి ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్, టీజర్స్ , సాంగ్స్ ఒక ఎత్తైతే తాజాగా విడుదల చేసిన పాట మాత్రం సినిమాకు బ్రేక్ తీసుకొచ్చిందని చెప్పాలి.. సినిమా విడుదల అనుకున్నా కూడా సినిమాకు బ్రేక్ తీసుకొచ్చింది..రోజుకో వార్తతో వార్తల్లో గట్టిగానే నిలుస్తుంది..

 


 ఇప్పటికే వివాదాస్పదమైన ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు. కానీ, ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పటి వరకు సెన్సారే పూర్తికాలేదు. మరోవైపు కోర్టులో ఒక కేసు కూడా నడుస్తోంది.ముఖ్యంగా పప్పులాంటి అబ్బాయి సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. వివాదం కూడా అయ్యింది. అయితే, ఇప్పుడు మరో పాటను వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘దండం’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను గురువారం విడుదల చేశారు.

 

బాబూ.. దండం, సలామ్, జయహో, సెల్యూట్ అంటూ పాట ప్రారంభమైంది. ‘‘ఇప్పటి రాజకీయంలోని కుట్రలనే చూస్తే భారతంలో శకుని కూడా షాకైపోతాడు. మాయమాటలు చెప్పే లీడర్లను చూస్తే రామాయణం మందర కూడా షేకైపోతుంది. కుటిల నీతికి అడ్రస్సు చాణక్యుడైనా.. కర్ణుడిని మోసం చేసిన శల్యుడే అయినా.. డంగైపోతారు, షివరైపోతారు’’ అంటూ ప్రస్తుత రాజకీయ నాయకుల పరిస్థితిని పాటలో వివరించారు సిరాశ్రీ.

 


మరో విషయమేమంటే ఈ పాట చివర్లో పవన్ కల్యాణ్, కే ఏ పాల్ మరియు లోకేష్ లను పాలు తాగిస్తో జోకర్ లను చేశాడు.మొత్తం మీద అంతా రాజకీయ దొంగలే అన్నట్టు ఈ పాట ద్వారా తెలియజేశారు. కానీ, ఆ ఒక్క వ్యక్తిని ఎందుకు ముట్టుకోనట్టో. భయపడ్డావా వర్మ..సినిమా మాట అటుంచి సినిమాలో సాగిన ప్రతి పాట మాత్రం హైలెట్ అనే చెప్పాలి.. ఇంకా తాజాగా విడుదల అయిన పాటలో మాత్రం ప్రముఖ వ్యక్తులను జోకర్లను చేస్తూ పాట వదిలావు చూడు.. నీకో ‘దండం’ వర్మ...

మరింత సమాచారం తెలుసుకోండి: