‘హ్యాపీ డేస్’ మూవీతో ఒకేసారి మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్ కు మొదట్లో వరస పరాజయాలు వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన ‘స్వామిరార’ ‘కార్తికేయ’ మూవీలతో ఈ యంగ్ హీరోకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే కొంతకాలం క్రితం విడుదలైన ‘కేశవ’ ‘కిర్రాక్ పార్టీ’ పార్టీ మూవీలు ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ నిఖిల్ ఫెయిల్యూర్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు విడుదల అవుతున్న ‘అర్జున్ సురవరం’ నిఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఈ మూవీని గత మే 1న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే అనేక ఆర్ధిక సమస్యలు ఈ మూవీని చుట్టుముట్టడంతో ఈ మూవీ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడి తన క్రేజ్ ను కొంత వరకు పోగొట్టుకుంది. 

అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా నిఖిల్ చాల పట్టుదలతో ఈ మూవీ ప్రమోషన్ ను చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో నిఖిల్ ఈమధ్య తన తల్లి తనకు ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టాడు. ఫ్యామిలీ సినిమాలు చేయకపోతే తన ఇంటిలోకి రానివ్వనని నిఖిల్ ను అతడి తల్లి బెదిరించిన విషయాన్ని బయట పెడుతూ ఇక తన సినిమాల ఎంపికలో చాల మార్పులు చేసుకుంటాను అన్న లీకులు ఇస్తున్నాడు. 

అంతేకాదు తన భవిష్యత్ లో తాను రీమేక్ సినిమాలలో నటించనని కేవలం మంచి కథ ఉంటేనే నటిస్తాను అని చెపుతూ ‘అర్జున్ సురవరం’ అందరూ చూడతగ్గ సినిమా అని చెపుతున్నాడు. డిగ్రీల దొంగ సర్టిఫికెట్ల మాఫియా చుట్టూ అల్ల బడ్డ ఈ పాత కథ నేటితరం ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుంది అన్నదే సందేహం. త్వరలో తనకు గతంలో కలిసి వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ లో నటించబోతున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ కు మెగా హీరో చిరంజీవి సపోర్ట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: