బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి సల్మాన్ ఇప్పుడు చిరంజీవిని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కావడం లేదు. అతడి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి కాని ఆ తరువాత రెండవ వారమే చతికల పడిపోతున్నాయి. 

దీనితో సల్మాన్ పని అయిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెగిటివ్ ప్రచారానికి ఎలర్ట్ అయిన సల్మాన్ ఈసారి తనకు గతంలో హిట్ తెచ్చిపెట్టిన ‘దబాంగ్ 2’ సీక్వెల్ గా ఇప్పుడు ‘దబాంగ్ 3’ నటిస్తూ ఈసారి దక్షిణాది ప్రేక్షకుల పై చాల దృష్టి పెడుతున్నాడు. 

ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ఈ మూవీలో సల్మాన్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో వేసిన వీణ స్టెప్ ను అనుసరిస్తూ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో స్టెప్స్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేస్తున్న ఈ స్టెప్ తో ఈసారి బాలీవుడ్ ను షేక్ చేయాలని సల్మాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. 

సల్మాన్ ఖాన్ సినిమాలకు జాతీయ స్థాయిలో మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. దీనితో ఈ ఒకనాటి ఈ వీణ స్టెప్ తో తనకు మళ్ళీ ప్రాభవం కలుగుతుందని సల్మాన్ ఖాన్ చాల ఆశలు పెట్టుకున్నారు. అయితే తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే రంజాన్ సీజన్ ను వదులుకుని ఇప్పుడు క్రిస్మస్ కు రాబోతున్న పరిస్థితులలో చిరంజీవి మ్యానియా సల్మాన్ ఖాన్ కు ఎంత వరకు విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ మూవీని దక్షిణాది భాషలు అన్నింటిలోను డబ్ చేస్తూ సల్మాన్ ఖాన్ ఈసారి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గర కావడానికి మరింత ప్రయత్నం చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ మూవీ ఇలా బాలీవుడ్ తో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడ ఆకర్షించడానికి ప్రయత్నించడంతో సల్మాన్ ఖాన్ తనకు బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిందని పరోక్షంగా అంగీకరిస్తున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: