తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ గేమ్ షో "బిగ్ బాస్". ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. టీ ఆర్పీ లెక్కలే దీనికి సమాధానం చెబుతున్నాయి. అయితే ఈ షో వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ తెలుగు ప్రజలని అమితంగా ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనూ, ఈ షో ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో వస్తుందో, అంతటా కూడా టాప్ షోగా నిలిచింది.

 

అయితే బిగ్ బాస్ షో తెలుగులో మూడవ సీజన్ ని పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకోగా రన్నరప్ గా శ్రీముఖి నిలిచింది. ఈ సారి టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. అయితే ఈ షోలో వచ్చిన కంటెస్టెంట్లకి పాపులారిటీ చాలా పెరిగింది. ఇంతకుముందు చాలా తక్కువ మందికే పరిమితమైన వాళ్ల పాపులారిటీ ప్రతీ ఒక్కరికీ తెలిసింది. అయితే ఈ మూడవ సీజన్ లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించిన వారిలో ప్రముఖంగా ఇద్దరు పేర్లు కనబడుతున్నాయి.

 


వారే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి. బిగ్ బాస్ లో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఏర్పడింది. అందువల్ల ఈ షోలో వీరి కెమిస్ట్రీ జనాలకి విపరీతంగా నచ్చింది. అయితే బయటకి వచ్చాక వీరి క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఆ క్రేజ్ వారి కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందనేది సస్పెన్స్ గా ఉంది. పునర్నవి ఇంతకుముందు చాలా సినిమాల్లో నటించింది. ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన పునర్నవి ఆతరువాత ఐదారు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.

 

ప్రస్తుతం ఆమె ‘సైకిల్’ అనే ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. మహత్ రాఘవేంద్ర హీరోగా, శ్వేతా వర్మ మరో హీరోయిన్ గా నటిస్తుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం పునర్నవి క్రేజ్ తో కనీస వసూళ్ళు దక్కించుకునేలా కనబడుతుంది. ఈ మధ్య రిలీజైన టీజర్ కి మంచి స్పందన లభించింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ పునర్నవికి సినిమా విషయంలో ఉపయోగపడితే మంచిదే. మరి ఈ మూవీకి పునర్నవి క్రేజ్ ఏమాత్రం ఉపయోగపడుతుందో విడుదలైతే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: