టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారిగా మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరసినిమా ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నారు. 

 

ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అదరగొట్టడంతో పాటుగా సినిమాపై ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెంచేయడం జరిగింది. లేడీ అమితాబ్ విజయశాంతిసినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుండి ఇకపై ఈ డిసెంబర్ లో రాబోయే ప్రతి సోమవారం ఒక్కొక్కొ సాంగ్ చొప్పున మొత్తం  ఐదు సోమవారాలు, సినిమాలోని ఐదు సాంగ్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సరిలేరు యూనిట్ కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసింది. 

 

ఇక గతంలో మహేష్ మరియు దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు మ్యూజికల్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నాయి. అయితే ఆ రెండు సినిమాలను మించే విధంగా దేవి ఈ సినిమాకు సాంగ్స్ మరింత అదిరిపోయేలా అందించాడని, తప్పకుండా సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించడం ఖాయం అని అంటోంది సరిలేరు యూనిట్. మహేష్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సంగీత, బండ్ల గణేష్ కూడా కొంత గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. మరి తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్న అనిల్ రావిపూడి ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: