'అర్జున్ సురవరం' సినిమా తాజాగా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో సినిమా హీరో నిఖిల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వీడియో సముఖంగా పంచుకున్నారు. అదేమిటంటే ఈ సినిమాలో సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి కి మరియు డైరెక్టర్ కి మధ్య ఒకానొక సందర్భంలో సినిమా సెట్లో పెద్ద గొడవ జరిగింది అని నిఖిల్ బయటపెట్టాడు. చాలా సినిమాల షూటింగ్ చేసిన అనుభవం ఉంది ఎప్పుడో కూడా నేను టెన్షన్ పడలేదు కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో...వీరిద్దరి మధ్య జరిగిన గొడవ బాగా టెన్షన్ పెట్టిందని జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

 

అయితే ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది అని చెబుతూ...పోసాని గారితో వర్క్ చేస్తున్నప్పుడు.. డైరెక్టర్ కి, పోసానికి మధ్య గొడవ జరిగిందని.. పోసాని ఏ సీన్ చేసినా.. రెండు, మూడు టేకుల్లో ఓకే అయిపోతుందని.. డైరెక్టర్ మాత్రం 16-17 టేకులు చేయించారని.. దీంతో పోసానికి కోపం వచ్చి దూరంగా వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే డైరెక్టర్ పోసాని దగ్గరకి వెళ్లి తను ఫస్ట్ టైం డైరెక్టర్ అని.. కొంచెం సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు పోసాని గారు మళ్లీ సెట్స్ పైకి వచ్చి లేట్ నైట్ వరకు ఉండి ఆ సీన్ చేశారని వెల్లడించారు.

 

షూటింగ్ మొత్తంలో తనను కాస్త టెన్షన్ కి గురిచేసిన ఘటన అది మాత్రమేనని చెప్పుకొచ్చాడు నిఖిల్. అంతేకాకుండా తన సినిమాకి స్వయంగా చీఫ్ గెస్ట్ గా చిరంజీవి రావటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా తనను ఒక సభ్యుడిలా ట్రీట్ చేయడం చిరంజీవి లాంటి లెజెండ్ నటుడు జీవితంలో మర్చిపోలేని సందర్భంలోని ఆయన గొప్ప వ్యక్తి అని ఆయన గొప్పదనం గురించి తెలియాలంటే ఆయన దగ్గరుండి చూడాల్సిందేనని నిఖిల్ ..చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: