మెగా బ్రదర్ నాగబాబు సక్సెస్ ఫుల్ కామెడీ షో 'జబర్దస్త్' నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ షో ద్వారా నాగబాబుకు ఎంతో పేరు వచ్చినా మన 'నవ్వుల నవాబు' నవ్వుకే ప్రేక్షకులు చాలామంది ఆయనతో పాటు కలిసి తెలియకుండానే నవ్వుతారు అన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా ఏళ్లగా అతని ప్రయాణం చేసిన జబర్దస్త్ నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం వెనుక ఉన్న కారణం గురించి నాగబాబు చాలా పొడిగించి వివరణ ఇవ్వడం కొందరికి విసుగు తెప్పిస్తోంది. అయితే ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న ప్రధాన ప్రశ్న నాగబాబు స్థానంలో ఏ ప్రముఖ వ్యక్తి సినీనటి మరియు ఎమ్మెల్యే రోజా తో కలిసి జడ్జి స్థానం పంచునున్నారు అన్నది.

 

నిజానికి నాగబాబు లాంటి వ్యక్తిని రీప్లేస్ చేయడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయమే. అతనికి జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో ఉన్న అనుబంధం మరియు వారిని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయాలన్న తపన అతనిని అందరికీ ప్రీతిపాత్రుడిని చేయగా ఇప్పుడు ఇమేజ్ ను అందుకోవడం కొత్తగా వచ్చిన ఎవరికైనా కష్టమే. అయితే మల్లెమాల ప్రొడక్షన్స్ వారు మాత్రం అతి త్వరగా నాగబాబు స్థానంలో మరో జడ్జిని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.

 

ఇప్పటికే చాలాసార్లు నాగబాబు లేదా రోజా గైర్హాజరీ లో మీనా, శేఖర్ మాస్టర్ ,అలీ, సాయి కుమార్ ఇంకా చాలామంది ఆ సీటును ఎక్కారు. అయితే వారికుండే వీలు మరియు డేట్ లను బట్టి జబర్దస్త్ బృందం అలీ లేదా సాయి కుమార్ లలో ఎవరో ఒకరిని జడ్జిగా మరి కొద్ది వారాల్లో ప్రవేశపెట్టనున్నారట. వీరిద్దరూ స్వల్ప కాలమే ఆ సెట్ లో అందరితో కలిసి నవ్వులు పంచుకున్నారు. అయితే వీరిద్దరికీ నాగబాబు ని మించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సమర్ఠత ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: