రంగస్థలం సినిమా వచ్చి చాలా రోజులు కావొస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా సుకుమార్ తన తదుపరి చిత్రం ఇంతవరకు స్టార్ట్ అవలేదు. అప్పటి వరకు తీసిన సినిమాలకు భిన్నంగా వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. రికార్డుల్లో బాహుబలిని పక్కన పెడితే రంగస్థలం టాప్ గా నిలిచింది. అయితే అంతటి రికార్డు సృష్టించాక కూడా సుకుమార్ తర్వాతి సినిమాకి ఇంత ఆలస్యం అవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

 

రంగస్థలం సినిమా తర్వాత పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం సుకుమార్ తో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద హీరోలు కూడా సుకుమార్ తో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సుకుమార్ మహేష్ తో సినిమా కోసం వెయిట్ చేశాడు. అయితే అనుకోని కారణాల వల్ల మహేష్ తో సినిమా ఆగిపోయింది. దానితో సుకుమార్ బన్నీతో సినిమా చేయాలని అనుకున్నాడు. బన్నీకి కథ కూడా వినిపించాడు.

 

బన్నీకి కథ కూడా నచ్చిందట. అయితే అప్పటికే బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తుండడంతో సుకుమార్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమా కథ ఇదేనంటూ సొషల్ మీడియాలో రోజూ వార్తలు వస్తున్నాయి. కథా ప్రకారంగా శేషాచలం అడవుల్లో సినిమా షూటింగ్ ఉంటుందట. అయితే ఈ సినిమా కోసం చిత్తూరు కి చెందిన నటుల కోసం అన్వేషణ సాగించాడట సుకుమార్. చిత్తూరు యాస్ మాట్లాడేవాళ్లకి ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నాడట

 


బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న "అల వైకుంఠపురములో" సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమా విడుదల అయ్యాక గానీ సుకుమార్ సినిమా మొదలవదు. లాంఛనంగా సినిమా ప్రారంభమయినప్పటికీ వచ్చే సంవత్సరం జనవరి చివరి వారం నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ౨౦౨౦ చివరి వరకు సుక్కూ సినిమా విడుదల అవుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: