రొమాంటిక్ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్, తమిళ హీరో ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఎన్నైనొక్కి పాయుమ్ తూటా'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు విడుదలైయింది. ఇటీవల ధనుష్
అసురన్ తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడంతో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కోలీవుడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆ అంచనాలను అందులేకపోయిందట.
క్రిటిక్స్ ఈ
సినిమా ను యావరేజ్ అని తేల్చేశారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ నిరాశ పరించిందని అంటున్నారు.
గౌతమ్ మీనన్ మార్క్ రొమాన్స్ , యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నా సెకండ్ హాఫ్ లో వచ్చే వాయిస్ ఓవర్స్
రొమాంటిక్ థ్రిల్లర్ ను పాడుచేశాయట. ఎప్పటిలాగే
ధనుష్ తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టగా
ధనుష్ , మెగా ఆకాష్ కెమిస్ట్రీ , సాంగ్స్ , విజువల్స్
సినిమా లో హైలైట్స్ అయ్యాయి.
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో 'తూటా' పేరుతో డబ్ చేశారు. అయితే తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈ చిత్రం ఈరోజు విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల చివరి నిమిషం లో తెలుగు వెర్షన్ విడుదల వాయిదాపడింది. అన్ని కుదిరితే
డిసెంబర్ లో తూటా ను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
శివ సంగీతం అందించిన ఈచిత్రంలో
ప్రముఖ నటుడు శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించాడు.
ఇక అసురన్ తరువాత ధనుష్ ప్రస్తుతం దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ధనుష్ కు జోడిగా నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపించనున్నాడు.