మొదట పలు టెలివిజన్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసి, ఆ తరువాత కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించిన శ్రీముఖి, ఆ తరువాత ఈటివి ప్లస్ ఛానల్ లో ప్రసారం అయిన పటాస్ షోలో తన ఆకట్టుకునే యాంకరింగ్ టాలెంట్ తో మంచి పేరు తో పాటు, యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించడం జరిగింది. అలానే ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3లో ప్లేస్ సంపాదించింది. మొత్తానికి ఆ షోలో ఎంతో తెలివిగా ఆడి ఫైనల్ వరకు చేరిన శ్రీముఖి, చివరకు రన్నరప్ గా మాత్రమే మిగిలింది. 

 

అయినప్పటికి ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని మంచి పేరు సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ అనంతరం తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్లి వచ్చిన శ్రీముఖికి వెల్లువలా ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఆమెతో స్టార్ మా ఛానల్ వారు ఒక షోలో యాంకర్ గా అవకాశం కల్పించారు. ఆ షోలో సింగర్ గా కూడా అదరగొట్టనుంది శ్రీముఖి. ఇక ఇటీవల బిగ్ బాస్ నిమిత్తం గతంలో తాను వదిలేసిన పటాస్ షో నుండి ఆమెకు మళ్ళి పిలుపు వచ్చినట్లు సమాచారం. 

 

అలానే కొందరు సినిమా దర్శకులు కూడా తమ సినిమాల్లో శ్రీముఖిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుతం బుల్లితెరపై దూసుకెళ్తున్న అనసూయ, రష్మీ తరువాత ఇప్పటికే మంచి పేరు సంపాదించిన శ్రీముఖి, ఇక రాబోయే రోజుల్లో వారిని మరింతగా మించి ముందుకు దూసుకెళ్లే పరిస్థితి కనపడుతోందని అంటున్నారు. శ్రీముఖికి వారిద్దరితో పాటు ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ విధంగా అనసూయ, రష్మీకి శ్రీముఖి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం గా కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: