కొన్నేళ్ళ క్రితం నుండి ఈటీవి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి మన తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మాతగా కొన్నేళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ కామెడీ షోకు ఛానల్ తో పాటు యూట్యూబ్ లో కూడా అద్భుతంగా వ్యూస్ వస్తుంటాయి. వాస్తవానికి ఈటివి ఛానల్ కొన్నేళ్ళ క్రితం రేటింగ్స్ పరంగా ఎంతో వెనుకబడి ఉందని, అయితే ఆ తరువాత జబర్దస్త్ షో వలన ఛానల్ రేటింగ్స్ ఎంతో వృద్ధి చెందాయని తెలుస్తోంది. 

 

ఇకపోతే మొన్నటి వరకు అంతా సజావుగా సాగిన ఈ షోలో మెల్లగా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ప్రస్తుతం పలు మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొదటగా ఇటీవల జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు షో నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన షో నుండి కొంత విరామం తీసుకోవడానికే బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయన తరువాత షో నుండి యాంకర్ అనసూయ, మరియు చమ్మక్ చంద్ర బయటకు రాగా, వారి దారిలోనే  హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి వారు కూడా బయటకు రావాలని భావించారట. ఆల్మోస్ట్ గా వాళ్ళు కూడా బయటకు వస్తారు అని అందరూ భావించిన సందర్భంలో షోలో ఒక జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా

 

మల్లెమాల టీమ్ వారితో మరియు సదరు పార్టిసిపెంట్స్ తో ప్రత్యేకంగా మాట్లాడి సయోధ్య కుదిర్చి వారిని షో నుండి బయటకు వెళ్లకుండా చూశారట. నిజానికి జబర్దస్త్ షోకు మంచి క్రేజ్ తీసుకువచ్చిన వారిలో హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ముందువరుసలో నిలుస్తారు అనే చెప్పాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదని భావించిన జబర్దస్త్ యాజమాన్యం, రోజాతో చొరవతోనే సంప్రదింపులు జరపడానికి ముందు వచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.  కాగా ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియదుగాని ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: