స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి ? అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కాంబినేషన్ అని ఫ్రూవ్ చేసుకునేందుకు అటు అల్లు అర్జున్, ఇటు త్రివిక్రమ్సినిమా కోసం ఎంతో క‌సితో పనిచేశారు.

 

కంప్లీట్ ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్‌ అప్డేట్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన టాక్ ప్రకారం 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమాలో ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని, ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ఇన్‌సైడ్ టాక్. అయితే ఈ డ్యూయ‌ల్ రోల్ ఎంతో సేపు ఉండ‌ద‌ట‌. కేవ‌లం ఐదు నిమిషాలు మాత్ర‌మే క‌నిపించి.. త‌ర్వాత మాయం అవుతోంద‌ట‌.

 

సినిమాలో ఓ సీన్లో సందర్భానుసారం మాత్రమే ఇద్దరు బన్నీలు కనిపిస్తారని... తర్వాత మళ్ళీ ఒక క్యారెక్టర్ తోనే సినిమా ర‌న్ అవుతుందని తెలుస్తోంది. ఇక అల వైకుంఠపురంలో సహజంగానే త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు... సెటైర్లు... కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయట‌. ముఖ్యంగా అల్లు అర్జున్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ప్రేక్షకులను పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేయిస్తాయని అంటున్నారు. 

 

అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హెగ్డే నటించడాం అలాగే సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: