ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, లెజెండరీ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తీసిన సినిమా ఎన్నై నోకి పాయుమ్ తోట. ఈ సినిమాను గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మించిన చాలాకాలంగా వాయిదా పడుతూనే వస్తుంది. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడు గౌతమ్ మీనన్. కానీ గౌతమ్ మీనన్ చేసిన ప్రయత్నాలు ఏ విధంగా ఫలించడం లేదు.
ఇక ధనుష్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకు ఆర్థిక కష్టాలు రావటంపై సినీ వర్గాలలో ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అయితే ఇటీవల కొంత తేరుకున్న గౌతమ్ మీనన్, ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు తిరిగి మొదలు పెట్టడం జరిగింది. తమిళ్తో పాటు తెలుగులో తూటా పేరుతో ఈ సినిమా రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కానీ గత నెల ఈ సినిమా రిలీజ్కు డేట్ ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడడం చాలా బాధాకరం. ఈ రోజు (29-11-2019) తూట రిలీజ్ అంటూ ప్రకటనలు కూడా చేశారు చిత్రయూనిట్. పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా సినిమాను వదిలేసి చేతులు దులుపుకోవాలని చిత్ర యూనిట్ భావనలో ఉంది. కానీ మరోసారి గౌతమ్ సినిమాను విడుదల చేయటంలో ఫెయిల్ విఫలం అవ్వడం జరిగింది.
సినిమా విడుదల ఆగిపోవడానికి కారణాలు తెలియకపోయినా కానీ ఈ రోజు రిలీజ్ లేదు అనే ప్రచారం కొనసాగుతుంది. డిసెంబర్లో మరో డేట్ కోసం ఇప్పటికే ఆలోచిచటం మొదలు పెట్టారట గౌతమ్ మీనన్ టీం, చిత్ర యూనిట్ తెలియయచేయడం జరిగింది. ఓ స్టార్ హీరోతో స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్థం కావటం లేదు అని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నారు. మరి ఈ సారి అయినా గౌతంమీనన్ ఇబ్బందుల నుంచి బయటకు పడి ఈ సినిమాను రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి మరి.