చాలా కాలానికి డైరెక్టర్ క్రిష్ణవంశీ సీన్ లోకి వచ్చాడు నక్షత్రం మూవీ ఫ్లాప్ తరువాత దాదాపుగా కెరీర్ క్లోజ్ అని అనుకుంటున్న క్రిష్ణవంశీ ఇపుడు ఒక సక్సెస్ ఫుల్ రీమేక్ కధతో కెమెరా వెనక్కు వచ్చాడు. మరాఠీలో నానా పాటేకర్ నటించిన నట సమ్రాట్ సినిమాకు రీమేక్ గా రంగమార్తాండను ఆయన నిర్మిస్తున్నారు. ఈ మూవీతొ మళ్ళీ పెద్ద హిట్ కొట్టి సక్సెస్ రూట్లోకి రావాలని క్రిష్ణవంశీ పెద్ద స్కీం పెట్టుకున్నాడు.

 

ఇదిలా ఉండగా ఈ మూవీ కోసం తన భార్య, సీనియర్ నటీమణి అయిన రమ్యక్రిష్ణ కాల్షీట్లు కూడా తీసుకున్నాడు. ఆమెతో పాటు ప్రకాష్ రాజ్ ని కూడా కీలకమైన నానా పాటేకర్ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. ఈ ఇద్దరూ రంగమార్తాండ మూవీలో భార్యాభర్తలుగా నటిస్తారట.

 

సినిమా మొత్తం రంగస్థలం, నాటకాలు మీద ఆధారపడిసాగుతుందని అంటున్నారు. ఒక సీనియర్ నటుడుగా ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. వీరికి కుమార్తెగా అనసూయ పాత్ర ఉంటుందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు తన చివరి రోజుల్లో పిల్లలు అన్న వారు ఆదుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తే ఆ బాధలను ఎలా తట్టుకుని నిలిచాడు అన్నది కధంశంగా ఉంది.

 

ఓ విధంగా ఇందులో అనసూయ పాత్ర కూడా కీలకమేనని అంటున్నారు. అనసూయ రంగమ్మత్త పాత్ర తరువాత ఇది మరపురాని పాత్ర అవుతుందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి అసలు విషయం క్రిష్ణవంశీ చెప్పాలి. ఏది ఏమైనా క్రిష్ణ వంశీకి ఇపుడు చేతిలో మంచి సినిమా పడింది. ఫ్యామిలీ డ్రామా ఎమోషన్లు కరెక్ట్ గా పండించడంలో క్రిష్ణ వంశీ సిద్ధహస్తుడు. ఆయన ఇపుడు రంగ మార్తాండను ఎలా తీస్తారన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది. అయితే కరెక్ట్ కధకు కరెక్ట్ కాస్టింగ్ పడడంతో క్రిష్ణ వంశీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: