సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నారు. భరత్ అనే నేను మరియు మహర్షి లాంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన ఖాతాలో పడటంతో సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని హ్యాట్రిక్ సరిలేరు నీకెవ్వరు సినిమా తో కొట్టాలి అని ఆశపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో మరియు అభిమానులను అలరిస్తోంది సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న తరుణంలో జనవరి 11న రిలీజ్ కాబోతున్న సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.

 

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఒకసారి వారి పేర్లు గమనిస్తే వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, పరశురామ్ తదితరులు మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా తనతో సినిమా చేయడానికి ఆరాటపడుతున్న డైరెక్టర్లకు మహేష్బాబు పెడుతున్న కండిషన్లకు డైరెక్టర్లు భయపడుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆయన పెడుతున్న కండీషన్ ఏంటంటే, తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన దర్శకులు ఆయనకు కథలోని పూర్తి విశ్లేషణతో కూడా నారేషన్ ఇవ్వాలట, ఆ విధంగా పూర్తిగా వివరణ ఇచ్చిన దర్శకుల కథలకే మహేష్ బాబు పచ్చ జెండా ఊపుతున్నారట.

 

అయితే దీనంతటికీ గల కారణం గతంలో పూర్తి కథ చెప్పిన తర్వాత దర్శకులను నమ్మి కథలో విశ్లేషణ ఇవ్వక పోయినప్పటికీ సినిమా చేస్తే చాలావరకు పరాజయాలు రావడం జరిగిందట. దీంతో ఇక పై తాను చేయబోయే సినిమా కథల విషయమై పూర్తి విశ్లేషణ లేనిదే సినిమా అంగీకరించేది లేదని మహేష్ … తనతో సినిమా చేయాలని అనుకుంటున్న డైరెక్టర్లకు క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: