తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకేసులో నలుగురు నింధిుతులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒంటరిగా వస్తున్న ప్రియాంక రెడ్డిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి అసహాయ స్థితిలో ఉన్న ఆమెపై మృగాళ్లా దాడి చేశారు.   ఈ కేసులో నిందితులంతా 25 ఏళ్లలోపు వారేనని తేల్చారు. నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషాను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు. వారంతా పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెను అపహరించి, ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసింది. ప్రియాంకారెడ్డి స్కూటీని నిందితులు ఉద్దేశపూర్వకంగానే పంక్చర్‌ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని సమాచారం.  

 

తాజాగా ఈ ఘటనపై పలువురు సినీ సెలబ్రెటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రముఖ నటి అనుష్క స్పందిస్తూ.. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని ఆమె అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన ఘటన. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి సిగ్గుపడతాయి. ఈ సమాజంలో ఒక ఆడపిల్లగా పుట్టం తప్పా..నేరమా? అని ప్రశ్నించారు.  ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. #RIPPriyanka Reddy’ అని అనుష్క పేర్కొన్నారు.

 

ఇక  ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ స్పందించింది. ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందని, అత్యంత క్రూరంగా ప్రియాంకా రెడ్డిని మానభంగం చేసి, హత్య చేశారని.. ఈ ఘటనల వలన  రోజురోజుకి భయం మరింత పెరిగిపోతుందని అన్నారు. మన దేశంలో ఆడవాళ్లకి భద్రత దొరకదా..? రోడ్డు మీద తిరిగే స్వేచ్చ కూడా లేదా అంటూ ఎమోషనల్ అయ్యారు.  ప్రియాంకా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.   నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ... పోలీస్ వ్యవస్థకు ఇది సిగ్గుచేటు చర్య అని.. ఇలా ప్రశ్నించడానికి వారికి సిగ్గుగా లేదా అంటూ మండిపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: