స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ అందరు వరుసబెట్టి వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. ఎవరికి వారు భారీ సినిమాలకు సంతకాలు చేస్తూనే సొంతగా ఓటీటీ వేదికల్ని ఏర్పాటు చేసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెటాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే ముందుగా ఓటీటీ వేదికపై పలు టాప్ రేంజు సంస్థలతో కలిసి అనుభవం కోసం పని చేస్తున్నారట. వెబ్ సిరీస్ లలో నటించడానికి ప్రధాన కారణం కేవలం పారితోషికం మాత్రమే కాదు.. ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయన్న సమారం తాజాగా బయటకు వచ్చింది. 

 

భారీ బడ్జెట్లతో భారీ సినిమాలు నిర్మించేంత సాహసం చేయలేకపోవడంతో మన హీరోయిన్సే సొంతగా ఓటీటీ వేదికలు పెట్టుకుని కొత్త ట్యాలెంట్ కు ఛాన్స్ ఇచ్చి లిమిటెడ్ బడ్జెట్ వెబ్ సిరీస్ లతో బాగా ప్రాఫిట్స్ పొందాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇక సొంత వేదికపై సినిమాలు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అన్నీ విధాలా వీలుంటుంది కాబట్టి ఈ దిశగా ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ అంతా అటు వైపు చూస్తున్నారట. ఆ కోవలో చూస్తే చాలామంది టాప్ రేంజ్ హీరోయిన్స్ కొత్త ఎత్తుగడలతో సరికొత్త ప్రాణాళికలతో దూసుకెళుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ అలా ప్రయత్నించిన వాళ్ళలో దాదాపు అందరు టాప్ హీరోయినే ఉన్నారు..ఒకరిద్దరు తప్ప.

 

అక్కినేని కోడలు సమంత వెబ్ సిరీస్ లో అడుగుపెట్టారు. 'ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సీజన్ లో నటిస్తున్నారు. తనకంటూ సొంత ఓటీటీ వేదికను రెడీ చేసుకోవాలన్న ఆలోచన సామ్ కి ఉందట. అలాగే అమలాపాల్ ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఓటీటీ వేదికపై తన అదృష్ఠాన్ని పరీక్షించుకోబోతోందని తాజా సమాచారం. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒకే చెప్పిందని లేటెస్ట్ న్యూస్. వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ స్ట్రీమింగుకి వస్తుంది. దర్శకుడు సహా ఇతరత్రా కాస్టింగ్ వివరాలు త్వరలో తెలియజేస్తారట. 

 

ఇక లేటెస్ట్ గా శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కూడా వెబ్ సిరీస్ లో ఎంటరవబోతోంది. 'ఘోస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను..2020 జనవరి 1 అర్థరాత్రి సమయంలో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లుగా జాన్వీ కపూర్ అనౌన్స్ చేసింది. రాధిక ఆప్టే- నీహారిక కొణిదెల- ఇషా రెబ్బా - ప్రియమణి- మంజరి ఫడ్నిస్- స్వరా భాస్కర్.. కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అంతేకాదు కొంతమంది స్టార్ హీరోలు ఫేమస్ యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్ నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ సహా మరికొంతమంది హీరోలు కూడా వెబ్ సిరీస్ నిర్మించి నటించే ఆలోచనల్లో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: