ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ మొదటి సినిమా నుండి స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నట్లుగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. మరీ భయంకరమైన డిజాస్టర్లు ఈ హీరో అకౌంట్ లో లేవనే చెప్పాలి. కంచె, ఫిదా, ఎఫ్-2 లాగా సూపర్ హిట్స్ లేదా అంతరిక్షం, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్.. మాదిరిగా యావరేజ్ అయినా అవుతున్నాయి. మొత్తానికి నిర్మాతలు మాత్రం సేఫ్ గానే ఉంటున్నారు. అంతేకాదు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలుచొని నీళ్ళు తాగడం బెటరన్న మాదిరిగా ఏడాదికి ఒకటి రెండు సినిమాలను మాత్రమే వరుణ్ చేస్తున్నాడు. హడావుడిగా సినిమాలు చేయాలని వరుణ్ ఆవేశపడటం లేదు. అయితే తన పద్దతిని మార్చుకోవాలని వరుణ్ భావిస్తున్నాడేమోనని ప్రస్తుతం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి సినిమాకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ఆ సినిమా మొదలవకుండానే మరో సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడట.

 

వరుణ్ తేజ్ కు ఈమధ్య కాలంలో చాలామంది దర్శకులు కథలు చెప్పారట. వాళ్ళలో ముఖ్యంగా సురేందర్ రెడ్డి,  వక్కంతం వంశీ ఉండటం విశేషం. వీళ్ళిద్దరితో సినిమాలకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరో ఇద్దరు కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేస్తానంటూ హామీ ఇచ్చాడని తాజా సమాచారం. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. వచ్చే వేసవిలో వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాను వరుణ్ ప్రారంభిస్తాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నా పేరు సూర్య సినిమా తర్వాత వక్కంతం వంశీ కనిపించకుండా తెర వెనుక ఉండిపోయాడు. మళ్లీ దర్శకత్వం చేసేందుకు సిద్దం అయ్యాడు. 

 

ఈసారి ఒక సింపుల్ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీని వరుణ్ తేజ్ కి వినిపించాడని.. వరుణ్ కూడా ఆ స్టోరీపై ఆసక్తి చూపించాడని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తేనే నమ్మగలం. ఎందుకంటే నా పేరు సూర్య రూపంలో బన్నీ కి వక్కంతం ఫ్లాప్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ సురేందర్ రెడ్డితో కూడా సినిమా ఉండే అవకాశం ఉందని కూడా మరో హాట్ న్యూస్. ఈ ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ వచ్చే ఏడాదిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరీ వీట్లో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా యావరేజ్ అనిపించుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: