బాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ ని క్రియోట్ చేసిన అడల్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. ఈ లస్ట్ స్టోరిస్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు కియారా అద్వానీ ని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ని చేసింది. ప్రస్తుతం కియారా అక్షయ్ కుమార్ తో రెండు సినిమాలతో పాటు మరో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు టాలీవుడ్ లో ఆఫార్స్ వచ్చినప్పటికి డేట్స్ సర్దుబాటు చేయలేనంతగా బాలీవుడ్ లో పాతుకుపోయింది. అందుకే హీరోయిన్స్ అందరు ఇప్పుడు వెబ్ సిరీస్ మీద మోజు పడుతున్నారు. సినిమాల కంటే వెబ్ సిరీస్ మీదే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే సమంత, జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్, రాధిక ఆప్టే వంటి స్టార్ హీరోయిన్స్ ఈ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. 

 

ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో నటించబోతోంది. తనే తమన్నా భాటియా. ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో ఐదు సినిమాల కసి తీర్చుకోవచ్చని ధీమాగా చెబుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ బ్యూటి ప్రస్తుతం  ది నవంబర్ స్టోరి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఆసక్తికరమైన డ్రామాతో తెరకెక్కనుంది. దుర్మార్గుడు హంతకుడు అయిన తండ్రి వల్ల కూతురు పడే ఇబ్బందులను తెరపై చూపిస్తారట. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ మేరకు ఇప్పటికే మిల్కీ బ్యూటీ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. రామ్ సుబ్రమణియన్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారట.

 

మిగతా హీరోయిన్స్ మాదిరిగానే ఓటీటీ వేదికకు వస్తున్న తమన్నా .. ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని నిరూపించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉందని వెల్లడించింది. ఐదు సినిమాల్లో నటించినంత అనుభవం ఒకే వెబ్ సిరీస్ తో వస్తుందని తన అభిప్రాయాన్ని తెలిపింది. మనలో ఉన్న ట్యాలెంట్ ను ఇంకా నిరూపించుకునేందుకు.. ప్రేక్షకాభిమానుల నుంచి మెప్పు పొందేందుకు ఓటీటీ వేదిక ఎక్కువ స్కోప్ నిస్తుందని వెల్లడించింది. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా దర్శక నిర్మాతలకి హింట్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: