రేపటి నుంచి డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోతున్న నేపధ్యంలో సంక్రాంతి సినిమాల ప్రమోషన్  హంగామాకు లైన్ క్లియర్ అవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి రేస్ విజేతగా మారాలని  ప్రయత్నాలు చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ డిసెంబర్ లో రాబోతున్న అయిదు సోమవారాలు అయిదు పాటలు విడుదల చేయబోతున్నారు.   


తెలుస్తున్న సమాచారం మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆరోజు ఆదివారం కావడంతో అన్ని విధాల బాగుంటుందని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెల అంతా పాటల హడావిడితో కొనసాగించి జనవరి ఫస్ట్ న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తారని టాక్. 

ఇప్పటికే ఒక్క పాట చిత్రీకరణ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిన నేపధ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ఎడిటింగ్ విషయమై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ ను ముఖ్య అతిధిగా పిలిచే ఆలోచన చేస్తున్నట్లు టాక్. హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో జరగబోయే ఈ కార్యక్రమానికి సుమారు లక్షమంది మహేష్ అభిమానులు వచ్చేలా ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్.

అదేవిధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్  కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక కీలక మంత్రిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరొక మంత్రిని అతిధులుగా ఆహ్వానించి మహేష్ తాను అందరివాడిని అని చెప్పుకునే పక్కా వ్యూహాలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీ విడుదలకు కేవలం ఒక్క వారం రోజులు ముందు జరిగే ఈ ఈవెంట్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మ్యానియా తారాస్థాయికి చేరే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని పక్కా వ్యూహాలలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: