సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా,  మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా,  గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్  అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణజరుపుకుంటోంది . ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్ లో సెట్ వేశారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్ కోసం సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. శ్రీ జో ఈ పాటకు సాహిత్యం అందించారు. నవంబర్ 30 రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

 

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - " గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి గతంలో 'భలే భలే మొగాడివోయ్' సినిమా తీశాం. అది బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ అదే టీమ్ కలిసి చేస్తోన్న చిత్రం  'ప్రతి రోజు పండగే'. దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఒక సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా  తీసుకెళ్లి మనకు తెలియకుండా మంచి మెస్సేజ్ ని మనలో ఎక్కించే  నేర్పరి తనలో ఉండే బహుకొద్ది మందిలో మారుతి ప్రధమ శ్రేణిలో ఉంటారు. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎన్ ఆర్ ఐ గురించి చెప్పిన స్టోరీ. ఇక్కడ ఉన్న వారితో కనెక్ట్ కాకుండా ఎలా ఇబ్బందిపడుతున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా కాలం నుండి సాయితో సినిమా చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. అలాగే రాశితో కూడా అలానే కుదిరింది. రాశి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తనతో 2020 లో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

 

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - " భలే భలే మొగాడివోయ్ చిత్రంతో ఈ రెండు బేనర్స్ ని కలిపాను. అరవింద్ గారి ప్రొడక్షన్ లో సినిమా తీస్తున్నప్పుడు ప్రతి షాట్ కి ఇది అరవింద్ గారి సినిమా వొళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి అనే భాద్యత అరవింద్ గారు మాకు  కనపడక పోయినా ఆయన ఇన్ఫ్లుయన్స్ మాత్రం మా అందరిలో ఉంటుంది. నాకు వ‌చ్చిన ఒక థాట్ ను అరవింద్ గారు ఇచ్చిన నమ్మకంతో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లగలిగాను. గీతా ఆర్ట్స్ లో ఎన్నో మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం ప్రతి రోజు పండగే. ఈ సినిమాకి సత్యరాజ్ గారు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. అలాగే రవిశంకర్ గారు ఈ సినిమాని ప్రేమించి సత్యరాజ్ గారికి వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. వంశి, వాసు పర్ఫెక్ట్ గా నన్ను జడ్జ్ చేస్తూ వచ్చారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 

 

సాయి తేజ్ మాట్లాడుతూ  - "గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో ఎప్పటినుండో సినిమా చేయాలి అనేది నా కోరిక. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ 'ప్రతి రోజు పండగే'. అరవింద్ గారు నేను ఇండస్ట్రీ కి వచ్చినప్పటినుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. థమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రాశి క్యారెక్టర్ ఫన్నీ గాఉంటుంది. మారుతి గారి స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ జయ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్  ఇచ్చారు.  ఇంతమంది ఆర్టిసులని కలిపి ఒక మంచి సినిమా తీసిన మారుతి గారికి థాంక్స్. రేపు మా సినిమా నుండి మూడో పాట విడుదలవుతుంది. మీ అందరికి తప్పకుండా  నచ్చుతుంది అనుకుంటున్నా" అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: